Tuesday, October 23, 2007

అంతా హ్యాపీ డేసే.............

ఈ మధ్య ఏక్కడ చూసిన హ్యాపీ డేస్ ఫివర్ పట్టుకుంది జనాలకి.ఏవ్వడ్ని చూసినా,కలిసినా ఇదే టాపిక్.ఎరా హ్యాపీ డేస్ సినిమా చూసావా అని.చూడలేదంటే ఇంకా చూడలేదా అని యక్ష ప్రస్నలతో మనల్ని వేధిస్తున్నరు.మనమేదో పెద్ద తప్పు చెసినట్టు మాట్లడుతున్నారు.వై.యస్ ఇందిరమ్మ,రాజీవ్ ల జపం చేసినట్టు ఇప్పుడందరూ హ్యపీ డేస్ జపం చేస్తున్నారు.ఎవడిని కదిపినా ఇదే ప్రస్న.ఇంకా చూడలేదంటే ఇప్పటి దాక ఏమి చెస్తున్నావ్ అని తిరిగి ప్రస్నిస్తున్నరు.అదేదో నేను జీవితంలో పెద్ద తప్పు చేసి అన్ని కొల్పొయినవాడిని చూస్తున్నట్టు చూస్తున్నారు.ఇన్ని బాధల మధ్య పొయిన ఆదివారం మధ్యాహ్నం చూసి వచ్చాను.


చాలా బాగుంది సినిమా.ఆచ్చు మన విద్యార్థి జీవితాన్ని ప్రతిబింబించేలాగుంది సినిమా.ప్రతి పాత్ర మనల్ని మనం చూసుకుంటున్నట్టుగా ఉంది.అందులో నాలుగు పత్రల్లో మనం మన ఫ్రండ్స్ ఉన్నట్టుగా ఫీల్ ఐయ్యి బగా ఇన్వొల్వెమెంట్ తొ చూడ దగ్గ సినిమా.ఆ సినిమా చూసాక నాకప్పుడు అర్ధమైంది అందరు ఎందుకు అడుగుతున్నారా అని.మంచి యూత్ సినిమా.ఆ సినిమా డైరక్టరైన శేఖర్ కమ్ముల గారికి నా ధన్యవాదములు.


మనస్సుకు హత్తుకునే సినిమా.చాల మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ ఒక పక్క చివరిలో అంత మంచి ప్రాణ స్నేహితులను విడదీసారనే బాధ ఒక పక్క.చాణ్ణాళ్ళకు ఒక మంచి సినిమా వచ్చింది.ఇక కధ విషయానికి వస్తే నాకు బాగా నచ్చిన పాత్ర రజెష్ ది,టైసన్ ది.కాని టైసన్ని శ్రవంతి తొ కలపనందుకు చాల బాధేసింది.ఇది ఎవడి స్టుడెంట్ లైఫ్ లొ వాళ్ళకి జరిగిన కథే.ఇలాంటి కథ మాకు జరిగింది.కాని మా కథలో అప్పు,మధు లేరు.అదొక్కటే లోటు మాకు.సీనియర్స్ ర్యాగింగ్ కూడ లేదనుకోండి.


మా కాలేజి పల్లెటూరిలో ఉండడం వలన మాకు అప్పూ,మధు దొరకలేదు దొరికే లొపల కొంతమంది(2) వెధవల వల్ల మొదటికే మోసం వచ్చింది.కాని వాళ్ళు లేకపొయినా బగానే ఆనదించామనుకోండి.కాని ఆ దుర్మర్గులను(2) మాత్రం జీవితంలొ మరచిపోము.ఆలాంటి దుర్మార్గులు ప్రతి కలేజిలోనూ ఉంటారు.అలాంటి వారితొ చాలా జాగ్రత్తగా మసలుకోవాలి లేకపోతే మన రహస్యాలన్నీ ఎవరికి ఎప్పుడు చేరాలో అప్పుడు చేరిపోతాయి తరువాత రాజేష్ లా ఎంత కాళ్ళు పట్టుకున్న ప్రయోజనం ఉండదు ఎందుకంటే అందారూ అప్పూలాగుండరుకదా.


ఈ సినిమా ఇంకా చూడని వారుంటే తొందరగా చూడవలసినదిగా మనవి.లేకపోతే మీరు కూడ నా లాగే బాధపడతారు.నేను మళ్ళా ప్రణాలిక వేస్తున్నను ఈ సినిమా కొసం.కాని టికెట్ దొరకడం లేదు.ఏమి జరుగుద్దో చూడాలి.

Friday, October 05, 2007

ఎర్ర బస్సు ప్రయాణం ..............

ముందు పోస్టుకి ఇది కొనసాగింపు ….…………….

ఇక ప్రయాణ విషయానికి వస్తే ఆ పల్లెటూరు నుంచి ఆ దగ్గర లొని నగరానికి ఎర్ర బస్సు ఉంటుంది. ఆ బస్సు మీద (ఈ బస్సు మనందరిది చేయి ఎత్తినచోట ఆపబడును) అనే కేప్షఞ్ ఉంటుంది.ఆ గ్రామానికి వెళ్ళలంటే అది ఎక్కి వెళ్ళవలసిందే.అది కూడ గంటకు ఒకటొ లేక రెండో.ఇది ఒకప్పటి మాట. కాని ఇప్పుడు బోలేడు ఆటోలు వచ్చేసాయనుకోండి.ఆ బస్సు మనల్ని ఎప్పుడు తీసుకెల్తుందొ ఆ బస్సు డ్రైవెర్కి కూడ తేలీదు అసలు వెల్తుందొ లేదో కూడ తేలీదు ఎందుకంటే ఏక్కడ పడితే అక్కడ ఆపుకుంటూ జనాల్ని ఎక్కించుకుంటూ పోతుంది. నీవు ఎక్క వలసిన బండి జీవిత కాలం లేటు అంటే ఎమిటొ అప్పుడర్థమవుతుంది.


ఇక రోడ్డు విషయనికి వస్తే సన్నని చిన్న బక్కపలచని రోడ్డు మధ్యమధ్యలో ఎత్తు పల్లాలతో మన ప్రయానం సాగి పొతునప్పుడు ఆ రోడ్డు పరిస్థితి చూసి మనం ప్రభుత్వ్యాన్ని తిట్టుకుంటూ దానిని గెలిపించినందుకు మనల్నిమనం తిట్టుకుంటూ చివరికి ఇంకెప్పుడు ఇక్కడికి రాకూడదు అని అనుకొని పక్క వారితొ పిచ్చాపాటి మాటలతో అలా సాగిపొతున్న ప్రయానంలొ మధ్యమధ్యలొ అమ్మలక్కల పిచ్చపాటి మాటలతో చివరికి ఏన్నొ వ్యయప్రయాసలతొ మన గమ్యస్థానం చేరుకుంటం.


అక్కడ బస్సు దిగంగానే అరుగు మీద కొంతమంది పనిపాటలేని వాళ్ళు,కాలక్షేపం కొసం కూర్చునే పెద్ద వాళ్ళు మనల్ని చూసి ఏరా ఎవరి తాలుక అని వాళ్ళ ఎదురుకుండా ఎర్ర బస్సు దిగినా సరే ఎప్పుడు వచ్చావు అని మనల్ని నానా తంటాలు పెట్టి చివరికి మన దగ్గరనుంచి విషయం రాబడతారు.రేడిఒ మిర్చి 98.3 ఫ్ ఎం కన్నా ఫాస్టు గా మనం వచ్చిన సంగతి ఊరు జనాలకి తెలిసిపొతుంది.ఇక ఆ ఊరిలొ తిరుగుతుంటే కనబడిన ప్రతీవారు “ఏర ఇదేనా రావడం, ఎప్పుడొచ్చావు” వంటి వగైరా వగైరా ప్రశ్నలతో మనల్ని అడుగుతుంటారు.కానీ వారు ఎంతో ఆప్యాయంగా మనల్ని పలకరిస్తుంటే మనం వాళ్ళని తిట్టుకుంటాం. ఎందుకంటే వళ్ళు మనల్ని తెలిసి అడుగుతున్నరో లేక తెలియక అడుగుతున్నరో మనకి తెలియక.కాని అలాంటి ఆప్యాయత ఇక్కడ దొరకదు.


అలా అలా ఆ రొజు గడిచిపొతుంది. ఇక సుబ్బరంగా స్వచ్చమైన పెరుగు వేసుకుని భొజనం చెసి ప్రయాణ బడలికతొ ఆరుబైట విశ్రమిస్థాం. మనల్ని లేపకముందే ఆ ఉదయభానుడు తన కిరణాలతో మనల్ని నిద్రలేపుతూ ఉంటే మనం ఆ భానుడ్ని తిట్టుకుంటూ వేరే దారి లేక నిద్ర లేస్తం.సర్లే గదా అని లొపల పడుకుంటే మన కరెంటు వాడిని వాళ్ళ ఆవిడ కొట్టినప్పుడో లేక తిట్టినప్పుడో వాడికి చిర్రెత్తుకొచ్చి నప్పుడో అది వస్తూ పోతూ ఉంటుంది.అప్పుడు మనం ఎందుకొచ్చామురా భగవంతుడా అని మనల్ని మనం తిట్టుకొని అలా మంచం మీద దొర్లుతూ మధ్య మధ్య లో దోమల సంగీతం వింటూ ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని అనుకుంటూ నిద్రకు ఉపక్రమిస్తాం.

ఇంకా ఉంది వచ్చేవారం చదవండి...............

Wednesday, October 03, 2007

మన పల్లెటూళ్ళు .......

ప్రియమైన ప్రేక్షకులకి ఇది నా రెండొవ బ్లాగు ఏమైన తప్పులుంటే మన్నించండి ఎవరినైన నొప్పిస్తే క్షమించండి.

అది ఒక అందమైన జిల్లా.ఆ జిల్లలో ఒక ప్రముఖ పున్యక్షేత్రం కలదు.దానికి దగ్గరలో ఒక అందమైన పల్లెటూరు.అది ఒక మారు మూల కుగ్రమం. ఆ పల్లెటూరికి ఇరువైపుల పచ్చని పొలాలు ఆ పొలం గట్లకిరువైపుల పచ్చని కొబ్బరి చెట్లు ఆ పొలాల మధ్య నల్ల త్రాచులాంటి ఒక సన్నని రోడ్డు ఆ పల్లెటూరిని దగ్గరలొను పెద్ద రోడ్డుని కలుపుతూ పొతుంది.పళ్ళెటూళ్ళే దేశ ప్రగతికి పట్టుకొమ్మలు.అలాంటి పల్లెటూరులు ఇప్పుడు జనం లేక వెలవెలబోతున్నాయి.
పల్లెటూర్లంటే ప్రకృతి అందాల భాండగారలు.ఉదయాన్నే భానుడు తన కిరనాలను పచ్చని పంటపొలల పై ప్రకాసింపచెస్తునప్పుడు ఆ పొలాలపై మంచు తెరలాగ పరుచుకుని ఏక్కడో కొడి కొక్కొరకో అని అరుస్తుంటె ఆ అనుభవం వర్ననాతీతం.సంధ్యవేళ పక్షుల కిలకిలరవాలమధ్య భానుడు వీడ్కొలు చెప్పుతూ చందమామకు స్వాగతం తెలుపుతున్నప్పుడు ఆ ప్రకృతి దృశ్యాలు వర్ననాతీతం.ఇలాంటి దృశ్యాలను మనము కోల్పోతున్నామనే బాధ ఎవరికి గుర్తుకురావటంలేదు వచ్చినా ఏమి చేయలేని పరిస్థితి.అక్కడ అంత కల్మషం లేని గాలి, మనుషులు ఎంతో ఆహ్లదకరమైన వాతావరణం.

అలంటి వతవరణాన్ని వదిలేసి నేడు గ్లొబలైశేట్ ఞ్ పున్యమని మన అందరం అలాంటి ప్రశాంతమైన వాతవరనాన్ని వదిలేసి ఈ కాంక్రిటు జంగిల్లొ పడిపొయాం ఎటు చూసిన జనం ఒకటె సబ్ధ,గాలి కలుష్యం ఇనా సరే అలాగే బ్రతికేస్తున్నాం.అలాంటి అందమైన పల్లెటూళ్ళను వదెలేసి నందుకు బాధ పడాలో లేక ఇలంటి రణగొణ ధ్వనుల మధ్య అగ్గిపెట్టలాంటి ఇంటిలొ బోలెడు అద్ది ఇచ్చి ఉంటున్నందుకు గర్వపడాలొ అర్ధంకావడంలేదు.

పల్లెటూరిలొ సొంత పాలు సొంత కూరగాయలు లంకంత కొంప పెద్ద దొడ్డి అన్నీ వదెలేసి ఇక్కడ అగ్గి పెట్టె లాంటి ఇళ్ళలొ బ్రతికెస్తున్నట్టి నా లంటి బ్రతుకూజీవులెందరో ఉన్నారు.కాని ఏమి చేయలేని పరిస్థితి కారనం ఇక్కడ మంచి ఉదొగ్యం పిల్లల భవిష్యత్తు చాల బాగుంటాయి అనే ఒక్క కారనం తప్ప ఇంకేమి లేదు.ఈ మధ్య సగం పల్లెటూర్లు కాళి ఇపొయాయి.కారనం అందరు పట్టనాలకు వలస పోతున్నారు.

అందమైన ప్రకృతి పచ్చని పంట పొలలను వదిలేసి కాలుష్యపు కోర్రల్లోకి పోతున్న ఈ జనులందరికి నా తొ సహ ఇదే నా ఆవేదన.ఇక్కడ అలవాటు పదిపొయి అక్కడికి వెళ్ళాలంటె చాలా ఇబ్బంది పడిపోతారు కొంత మంది అందులో నేను ఒక్కడిని.మరి కొంత మంది వెళ్ళాలనుకున్న వెళ్ళలేని పరిస్థితి దానికి సవాలక్ష కారనాలు చెబుతారు.ఇక్కడంతా యాంత్రిక జీవనం మధ్య బ్రతికేస్తు మనం ఏమి కోల్పోతున్నమో మనకి అర్ధం కావడం లేదు.ఇదివరకు సగటు మనిషి జీవిత కాలం నూరు సంవత్సరములు కాని అది క్రమీన తగ్గి నేడు అరవయ్కి చేరింది కారణం కాలుష్యం పైగా కుట్రలు కుతంత్రాలు నిండిన మనుషుల చుట్టూ బ్రతుకుతున్న అభాగ్యజీవులెందరో ఎప్పుదు ఏ ఆపద వస్తుందో తెలీదు ఇనా సరే బ్రతికేస్తున్నం .